రైతుల హక్కులను పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి

66చూసినవారు
నిబంధనలు పాటించకుండా వైసీపీ నాయకులు సొంతంగా వాడుకుంటున్న ట్రాక్టర్లపై విచారణ చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వ్యవసాయాధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు దారి తప్పిన యంత్రాలను తిరిగి వెనక్కి రప్పించి, తదుపరి చర్యలు తీసుకునే దిశగా కసరత్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రానికి 28 ట్రాక్టర్లలో 25 ట్రాక్టర్లను సంబంధిత లబ్ధిదారులు పెదవేగి మండల పరిషత్‌ కార్యాలయం దగ్గరకు తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్