వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతుల రుణాలు మాఫీ చేయాలి.

77చూసినవారు
భారీ వర్షాలు వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులు, కౌలు రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని, నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. నష్టపరిహారం కౌలు రైతులకే అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షనీయమన్నారు.

సంబంధిత పోస్ట్