ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించండి.

60చూసినవారు
ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని, ధాన్యం పట్టుబడికి నాణ్యమైన గోనె సంచులు అందించాలని, తగినన్ని లారీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు నగరంలోని స్థానిక పవర్ పేటలో గల అన్నే భవనంలో ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు. రబీ ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాతలు అష్ట కష్టాలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్