టెన్నిస్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సిఐ గుత్తుల శ్రీనివాస్

70చూసినవారు
శ్రీ రుద్రరాజు పద్మరాజు మెమోరియల్ టెన్నిస్ స్టేట్ టోర్నమెంట్ ను, మంగళవారం పాలకొల్లు కాస్మో క్లబ్ ఆధ్వర్యంలో రూరల్ సిఐ గుత్తుల శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వహించిన సభలో సిఐ మాట్లాడుతూ క్రీడలకు, చదువుతోపాటు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు రుద్ర సత్యనారాయణ రాజు అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్