వేడంగిలో జనం చెంతకు జనసేన

890చూసినవారు
వేడంగిలో జనం చెంతకు జనసేన
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం వేడంగి గ్రామంలో జనసేన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జనం ఎంతకు జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీల జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామంలో ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ ఒకసారి అవకాశం ఇవ్వాలని రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంచారు. కార్యక్రమంలో తొలుత స్థానిక హిందూ స్మశాన వాటికి వద్ద దాతల సహకారంతోను, జన సైనికుల శ్రమదానం తోను రూ రెండు లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్ ను గ్రామ సర్పంచ్ చెల్లబోయిన పద్మ పార్వతీ శారద ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్