కీలక దశలో గండ్ల పూడ్చివేత పనులు: మంత్రి నిమ్మల

74చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వద్ద, బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు బిజీగా ఉన్నారు. పనులు కీలక దశకు చేరుకున్నాయని, 3 గండ్లలో, 2 గండ్లను పూడ్చివేసినట్లు శుక్రవారం మంత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మూడో గండి పూడ్చివేత పనులు జరుగుతున్నాయన్నారు. గండ్ల పూడ్చివేత పనుల ప్రగతిని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ లకు అప్డేట్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్