రైల్లో ప్రయాణించిన మంత్రి రామానాయుడు

79చూసినవారు
కర్నూలు, చిత్తూరు, సత్య సాయి, అనంతపురం జిల్లాల్లో 4 రోజుల పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిశీలన, ఉన్నతాధికారులతో రివ్యూ వంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం పాలకొల్లు నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ రైల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రయాణించారు. ఆయన పాలకొల్లు రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కారు. ఈ సందర్భంగా అక్కడ ప్రయాణికులు మంత్రిని మర్యాదపూర్వకంగా పలకరించారు.

సంబంధిత పోస్ట్