ప్రతిభ కనబరిచిన శివప్రసాద్

73చూసినవారు
యలమంచిలి మండలం ఏనుగు వానిలంక బాడవ గ్రామానికి చెందిన శివప్రసాద్ నాలుగు వేల మీటర్ల దారాన్ని ఉపయోగించి 65 గంటల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటని రూపొందించాడు. ఆ చిత్రపటం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ కటింగ్ ఆర్ట్ ద్వారా వినాయకుడు, సింహం , పులి, తదితర చిత్రాలను రూపొందించాడు. పెన్సిల్ మొనపై జాతీయ పతాకం, తల్లి కడుపులోని బిడ్డ, శివలింగం తదితర వాటిని రూపొందించారు అవి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిని మొగల్తూరు అభ్యాస కళాశాలకు తీసుకొచ్చిన సందర్భంగా పలువురు విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.

సంబంధిత పోస్ట్