విద్యార్థులు గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

753చూసినవారు
విద్యార్థులు గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులు వేసవి సెలవులలో గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి ఎమ్ శేఖరబాబు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని జిన్నూరు శాఖా గ్రంధాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. గ్రంధాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆయన తిలకించారు. కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో అందరికీ అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులందరూ గ్రంథాలయానికి వచ్చి తమ విలువైన సమయాన్ని గ్రంథాలయంలో గడపాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయంలో సభ్యులుగా చేరాలన్నారు. గ్రంధాలయ పాలకురాలు బత్తుల జోగారత్నం వాలంటీర్ బండారి వెంకటరమణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్