సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లలో, బోర్డర్ చెక్ పోస్ట్లలో వాహనాల తనిఖీ పక్కాగా చేపట్టాలని ఐటీడీఏ పీవో యం. సూర్యతేజ అధికారులను ఆదేశించారు. ఆదివారం జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి, స్టాటిక్ సర్వేలెన్స్ టీంకి దిశానిర్దేశం చేశారు.