టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ ఇస్తామని వెల్లడించారు. సాధారణ పెన్షన్లను కూడా నెలకు రూ.4 వేలకు పెంచుతామని తెలిపారు. మహిళలకు నెలకు రూ.1500 అందిస్తామని, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా.. అందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.