కొయ్యలగూడెం పట్టణంలోని త్రి శక్తి పీఠం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని మంగళవారం పోలవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సాయంత్రం జరగనున్న వారాహి విజయభేరి బహిరంగ సభ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు, నాయకులు పాల్గొన్నారు.