తాడేపల్లిగూడెం నియోజకవర్గం మండల కేంద్రమైన పెంటపాడులో జనసేన, బిజెపి, టిడిపి టిడిపి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం ఉదయం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఉదయమే పొలాలకు వెలుతుండటంతో వారిని కలిసేందుకు బొలిశెట్టి శనివారం నుంచి ఉదయం పూట కూడా ప్రచారాన్ని ప్రారంభించారు.