గూడెం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన హెల్త్ జాయింట్ కమిషనర్

53చూసినవారు
గూడెం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన హెల్త్ జాయింట్ కమిషనర్
తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ తనిఖీ చేశారు. ఇటీవల మహిళ మంచం పైనే ప్రసవించిన ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించి, రోగులతో స్వయంగా మాట్లాడారు. సిబ్బంది పని తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ఎంవో తాతారావు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్