హైదరాబాద్ కూకట్పల్లిలో ఈనెల 14వ తేదీన జరగనున్న 'మీరు నేను మనం మన నియోజకవర్గం'కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని జనసేన తాడేపల్లిగూడెం ఉమ్మడి కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో 'మీరు నేను మనం మన నియోజకవర్గం'కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు మన నియోజకవర్గ అభివృద్ధిపై జరిగే చర్చలో పాల్గొనాలి అన్నారు.