తణుకులో శాంతి ర్యాలీ నిర్వహించిన వైద్యులు

50చూసినవారు
కోల్ కతాలోని వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో శనివారం తణుకులో శాంతి ర్యాలీ నిర్వహించారు. తణుకు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇటీవలి కాలంలో వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్