వరద బాధితులకు మాజీ ఎమ్మెల్యే కుమారుడి విరాళం

63చూసినవారు
వరద బాధితులకు మాజీ ఎమ్మెల్యే కుమారుడి విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం తణుకు మాజీ ఎమ్మెల్యే వై. టీ రాజా కుమారుడు అవినాశ్ రూ. 20 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమక్షంలో సీఎం సహాయనిధికి అవినాశ్ రూ. 20 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్