ఏలూరు జిల్లాలో 115 టెండర్లు దాఖలు

72చూసినవారు
ఏలూరు జిల్లాలో 115 టెండర్లు దాఖలు
నూతన మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఏలూరు జిల్లాలో మూడు రోజుల్లో 115 టెండర్లు అందినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అవులయ్య తెలిపారు. చింతలపూడి సర్కిల్‌ పరిధిలో అత్యధికంగా 38 టెండర్లు దాఖలు కాగా, అత్యల్పంగా ఏలూరు సర్కిల్‌లో 3 మాత్రమే వేశారు. నూజివీడు సర్కిల్‌లో 29, భీమడోలు సర్కిల్‌లో 20, జంగారెడ్డిగూడెం సర్కిల్‌లో 14, పోలవరం సర్కిల్‌లో 6, కైకలూరు సర్కిల్‌లో 5 చొప్పున టెండర్లు దాఖలయ్యాయి.

సంబంధిత పోస్ట్