నిర్మానుష్యంగా రహదారులు
భానుడి భగ భగలతో ఆదివారం మధ్యాహ్నం పెంటపాడు మండల వ్యాప్తంగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. 40° డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మండల కేంద్రం పెంటపాడుతో పాటు, చిలకంపాడు, భైరవ పెంటపాడు, పడమర విప్పర్రు, బోడపాడు, చిలకంపాడు తదితర గ్రామాలలో ఎండ వేడిమి దాటికి ప్రజలు బయటకు రావడానికే ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.