అబద్దాల జగన్ను సాగనంపుదాం: బొలిశెట్టి
వైసీపీ ప్రభుత్వం చేయాల్సిన అవినీతి అక్రమాలు చేసి, వాటిని వేరేవారి ఖాతాలోకి నెట్టేసిన అబద్దాల జగన్ను సాగనంపుదామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడులో శుక్రవారం 'జనసేన పల్లెపోరు'కార్యక్రమాన్ని నిర్వహించారు. కరపత్రాలను పంచిపెట్టారు. నన్ను గెలిపిస్తే పెంటపాడులో డ్రైనేజీ వ్యవస్థని మారుస్తాననీ, మంచినీటి కొరత లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.