టీడీపీ నేత మహాసేన రాజేశ్ ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. తాను టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. "అందరి సూచనలు, సలహాల మేరకు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో ఉండాలని నిర్ణయించాం. నా మీద నమ్మకముంచిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు. మహాసేన అనేది ఇప్పుడు టీడీపీ ఆస్తి అని, మరొక 30 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించాలని ఆయన కోరారు. అందుకు మహాసేన కూడా సిద్ధం." అని ఆయన పేర్కొన్నారు.