కేసులకు వైసీపీ నేతలు భయపడొద్దు: జగన్

73చూసినవారు
కేసులకు వైసీపీ నేతలు భయపడొద్దు: జగన్
తాడేపల్లిలో పశ్చిమ గోదావరి నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. వైసీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటాలు చేయాలని, కేసులకు భయపడొద్దని ఆయన అన్నారు. 'కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తోంది. వైసీపీ, టీడీపీ పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందన్న దానిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే' అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్