నిరసన తెలుపుతున్న గెస్ట్ ఫ్యాకల్టీపై పోలీసుల లాఠీ చార్జి (వీడియో)

75చూసినవారు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బుధవారం రాత్రి నిరసన తెలుపుతున్న అతిథి అధ్యాపకులు (గెస్ట్ ఫ్యాకల్టీ)పై పోలీసులు లాఠీ చార్జి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి అతిథి అధ్యాపకులు నగరంలోని అంబేడ్కర్ మైదాన్‌కు తరలివచ్చి తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం నిరవధిక సమ్మెలో కూర్చున్నారు. అయితే అర్ధ రాత్రి వీధి లైట్లు లేని ప్రదేశంలో పోలీసులు వారిని కర్రలతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్