పోస్టల్ బ్యాలెట్ రూల్స్‌పై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్

82చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ రూల్స్‌పై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్
పోస్టల్ బ్యాలెట్‌పై ఆర్ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దంటూ సీఈవో ఎంకే మీనా ఇచ్చిన మెమోపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను ఇవాళే అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.

సంబంధిత పోస్ట్