ముడా కేసు.. 14 ప్లాట్‌లను వదులుకుంటానన్న సీఎం భార్య

78చూసినవారు
ముడా కేసు.. 14 ప్లాట్‌లను వదులుకుంటానన్న సీఎం భార్య
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన కొన్ని గంటల తర్వాత, 14 ప్లాట్‌లను వదులుకుంటానని ఆయన భార్య పార్వతి ప్రకటించారు. "నా భర్త గౌరవం కంటే సైట్, ఇల్లు, ఆస్తి లేదా సంపద ముఖ్యమైనది కాదు’ అని పేర్కొన్నారు. మైసూరులోని విజయనగర్ లేఅవుట్ (3వ మరియు 4వ దశలు)లో ప్లానింగ్ అథారిటీ వినియోగించుకున్న 3.16 ఎకరాల భూమికి బదులుగా తనకు కేటాయించిన 14 ప్లాట్లను వదులుకుంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్