ఈజిప్టులోని రేవు నగరమైన హుర్ఘడలో విషాదం చోటుచేసుకుంది. ఎర్ర సముద్రంలో పర్యటించడానికి వెళ్లిన పర్యాటకుల సబ్మెరైన్ మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో సబ్మెరైన్లో దాదాపు 40 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వారిలో 6 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలు కాగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.