శ్రీరామ నవమి వేడులకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. ఇందు కోసం ఆలయ శిఖరం నుంచి సూర్య కిరణాలు గర్భాలయంలో కొలువైన బాల రాముడి నుదుటిన పడేలా ఏర్పాట్లు చేయనున్నారు.