సీఎం వైఎస్ జగన్ ఈ నెల 28 వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో వైఎస్ఆర్ సర్కిల్ లో జరిగే ప్రచారసభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరిలో త్రిభువని సర్కిల్ లో జరిగేసభలో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కెఎంసి సర్కిల్ లో జరిగే ప్రచారసభలో పాల్గొంటారు.