గుంటూరు జిల్లా జైలుకు వైఎస్ జగన్

56చూసినవారు
నేడు గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శించడానికి గుంటూరు జిల్లా జైలు వద్దకు వైఎస్ జగన్ వెళ్లారు. జైల్‌లో నందిగం సురేష్‌తో ఆయన ములాకత్ కానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జైలు వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఒక్కసారిగా జగన్‌తో పాటు జైల్లోకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. కాగా, మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్