వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న టిడిపి నేత రితీష్ రెడ్డి

77చూసినవారు
వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న టిడిపి నేత రితీష్ రెడ్డి
వినాయక చవితి పురస్కరించుకొని బద్వేలు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి, సిద్ధవటం రోడ్డులోని ఎన్జీవో కాలనీ వద్ద ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహాలను టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి వస్త్రంతో రితీష్ రెడ్డిని సత్కరించి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్