కేంద్ర ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా తయారైంది: తులసిరెడ్డి

73చూసినవారు
కేంద్ర ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి ధ్వజమెత్తారు. నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ అయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కలిసి శుక్రవారం వేంపల్లెలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తులసిరెడ్డి మాట్లాడుతూ. 10 సంవత్సరాలలో 72సార్లు పేపర్ లీక్ అయిందని అన్నారు. తిరిగి నీట్ పరీక్ష జరిపించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్