గండి నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం

76చూసినవారు
గండి క్షేత్రంలో శాశ్వత నిత్యాన్నదాన పథకానికి యర్రగుంట్ల పట్టణానికి చెందిన తుంగా వెంకటరామి రెడ్డి అమృత లక్ష్మి దంపతులు బుధవారం రూ. 1, 00, 116 విరాళం అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుంద రెడ్డి తెలిపారు. వీరికి ఆలయ అర్చకులు కేసరిస్వామి, రాజాస్వామి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ, ప్రసాదాలు, స్వామివారి చిత్ర పటం, శేష వస్త్రంతో వేద ఆశీర్వచనం చేశారు. చైర్మెన్ కావలి క్రిష్ణ తేజ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్