వైసీపీ పాలనలో పేదల నుంచి 10 వేల ఎకరాలు లాక్కున్నారు: చంద్రబాబు

52చూసినవారు
వైసీపీ పాలనలో పేదల నుంచి 10 వేల ఎకరాలు లాక్కున్నారు: చంద్రబాబు
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘వైకాపా పాలనలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 10 వేల ఎకరాలను బలవంతంగా లాక్కున్నారు. వైకాపా నేతలు ముందుగానే భూములను తక్కువ ధరకు కొనేసి, రెండింతల ధరకు ప్రభుత్వానికి విక్రయించారు. ఆ భూములు ఇళ్ల స్థలాలకు పనికిరావని తెలిసినా కేటాయించారు. ఆ భూముల లెవెలింగ్‌ పేరుతోనూ దోచుకున్నారు.' అని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్