ముంబై ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.7 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో మొత్తం 24 కేసుల్లో 11.40 కిలోల బంగారం పట్టుబడింది. ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.