రేణుకా స్వామి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న నటుడు దర్శన్కు మరో షాక్ తగిలింది. కస్టడీ గడువు ముగియడంతో ఇవాళ అతడిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన 24వ ఏసీఎంఎం కోర్టు.. దర్శన్తో పాటు మరో ముగ్గురు నిందితులు వినయ్, ప్రదుష్, ధనంజయ్లను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. ప్రస్తుతం దర్శన్ ను పరప్ప అగ్రహారానికి తీసుకెళ్లేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.