హమాస్ మిలిటెంట్లతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్లో ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనలు మరోసారి దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 45 మంది పాలస్తీనియన్లు మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు అల్ అహ్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.