AP: గుంటూరు జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్లపై రైల్వే అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "గత ఐదేళ్లలో రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావని మాజీ సీఎం జగన్ పట్టించుకోలేదు. ప్రస్తుతం జిల్లా పరిధిలో దాదాపు రూ. 2 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి." అని తెలిపారు.