UPSC నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు మొత్తం 147 మంది ఎంపికయ్యారు. వారిని UPSC వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు రికమెండ్ చేసింది. జనరల్ కేటగిరీలో 43 మందిని ఎంపిక చేయగా.. EWS 20, OBC 51, SC 22, ST 11 మంది చొప్పున ఎంపికయ్యారు. రిత్విక పాండే, కాలె ప్రతీక్ష నానా సాహెబ్, స్వస్తిక్ యదువంశీ తొలి మూడు ర్యాంకులు సాధించారు.