తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ఢిల్లీలో ఆర్&బీ స్పెషల్ సెక్రెటరీ హరిచందన ఐఏఎస్ను కలిశారు. అనంతరం జాతీయ రోడ్డు రవాణా అండ్ జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న 16 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా నల్గొండ బైపాస్ నిర్మాణం గురించి కూడా చర్చించారు.