జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ ట్యాంక్లోని నీరు తాగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దురులోని అప్గ్రేడ్ అయిన ప్రైమరీ స్కూల్లో శనివారం ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం భోజనానంతరం విద్యార్థులు అక్కడి ట్యాంక్లోని నీరు తాగి వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.