తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)లో విద్యార్థులు ఈనెల 20 నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సూచించారు. ఈ నెల 30 వరకు గడువు ఉంటుందన్నారు. గతంలో ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ప్రకటించామని... విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల వినతి మేరకు దాన్ని సవరించామన్నారు.