తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆదివారం 69,870 మంది స్వామివారి దర్శించుకోగా, 42,119 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.