బొగ్గు గని కూలి 50 మంది గల్లంతు (వీడియో)

2113328చూసినవారు
చైనా ఇన్నర్ మంగోలియాలో ఘోర విషాదం జరిగింది. అల్క్సా లీగ్ లో బొగ్గు గని కుప్పకూలి ఇద్దరు మృతి చెందారు. మరో 50 మందికి పైగా కార్మికులు గల్లంతయ్యారు. దాదాపు 200 మంది రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాద సమయంలో గనిలో ఎంత మంది కార్మికులు ఉన్నారనే సమాచారంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. డ్రోన్ల సాయంతో ప్రమాద ప్రాంతాన్ని గుర్తిస్తున్నట్లు చెప్పారు.