మంత్రి పొన్నం ప్రభాకర్ లారీ యజమానుల నుండి రూ.100 కోట్లు తీసుకున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రామగుండం ఎన్టీపీసీ నుండి హుజురాబాద్ మీదుగా ఖమ్మంకు ఎలాంటి వే బిల్లులు లేకుండా అధిక లోడుతో రోజుకు 300 బూడిద లారీలు వెళ్తున్నాయని అన్నారు. దీనికోసం రోజుకు 50 లక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్కు వెళ్తున్నాయని, ఇప్పటికే 100 కోట్లు వెళ్లాయని ఆరోపించారు. వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.