బ్యాంకాక్ నుంచి బెంగళూర్ థాయ్ ఎయిర్వేస్ విమానంలో ఓ మూల దాచిన ఒక హ్యాండ్ బ్యాగులో రూ.4.77 కోట్ల విలువైన 6.834 కిలోల బంగారు బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన ఎమిరేట్స్ విమానంలోని లావేటరీలో రూ.1.52 కోట్ల విలువైన 2.18 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.