800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక

67చూసినవారు
800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక
చెన్నైకి చెందిన 13 ఏళ్ల బాలిక 12 గంటలు కష్టపడి 800 కేజీల తృణధాన్యంతో పీఎం నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ పెయింటింగ్ గా ఇది యూనికో వరల్డ్ రికార్డుని సొంతం చేసుకుంది. ప్రెస్లీ షెకీనా అనే బాలిక సెప్టెంబరు 17న ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని తృణ ధాన్యాలతో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భారీ చిత్రాన్ని రూపొందించింది. కాగా ప్రెస్లీ ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.

సంబంధిత పోస్ట్