మందు వెళ్తున్న బస్సును ఢీకొట్టిన వెనుక బస్సు.. షాకింగ్ వీడియో

56చూసినవారు
తమిళనాడులో ఘోర ప్రమాదం తప్పింది. బస్సులో వెళుతున్న 50 మంది ప్రాణాలతో బయటపడ్డారు. సేలం-చెన్నై జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ముందు వెళుతున్న బస్సు సడెన్‌గా యూటర్న్ తీసుకోడానికి కుడి పక్కకు తిరగడంతో దాని వెనుకే ఉన్న మరో బస్సు దానిని ఢీకొని కొంతదూరం వెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ 50 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్