రైలు కింద చిక్కుకొని 100 కి.మీ వెళ్లిన బాలుడు (వీడియో)

84చూసినవారు
ఓ బాలుడు గూడ్స్ రైలు కింద చక్రాల్లో ఇరుక్కొని ఏకంగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే స్టేషన్ దగ్గర్లో నివాసం ఉంటున్న ఓ కుర్రాడు ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలు చక్రాల వద్ద కూర్చున్నాడు. అదే సమయంలో రైలు కదలడంతో అక్కడే ఉండిపోయాడు. ఇలా దాదాపు 100 కి.మీ ప్రయాణం చేశాడు. చివరికి అతడిని ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించారు.

సంబంధిత పోస్ట్