ప్రముఖ వ్యాపారవేత్త, ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ ప్రేమ్ వాత్స తాను చదువుకున్న మద్రాస్ ఐఐటీకి భారీ విరాళం అందజేశారు. ఈ మేరకు మెదడుపై జరిపే పరిశోధనల కోసం సుధా గోపాలకృష్ణ బ్రెయిన్ సెంటర్కు ఐదు మిలియన్ల అమెరికన్ డాలర్లు (రూ.41 కోట్లు) విరాళంగా ఇచ్చారు. అంకిత భావం, నాణ్యతతో ఐఐటీ మద్రాస్కు చెందిన గోపాలకృష్ణ బ్రెయిన్ సెంటర్ అద్భుతమైన పరిశోధనలు నిర్వహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.