మహారాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం నాడు మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుతో సంతృప్తి చెందని మరాఠాలు మరోసారి నిరసనలకు పిలుపునిచ్చారు. మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరాంగే తన నిరాహార దీక్షను విరమించలేదు. ఈ నెల 24న మరోసారి నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని షిండే మండిపడ్డారు. బిల్లు విషయంలో మరాఠాల డిమాండ్ నెరవేరలేదని స్పష్టం చేశారు.